
Rythu Seva Kendram: Rythu Bharosa Kendram to be Renamed As Rythu Seva Kendram
Rythu Seva Kendram: ఆంధ్ర ప్రదేశ్ లో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో చాలా పథకాల పేర్లు అలాగే మిగతా శాఖల పేర్లు మార్చడం జరుగుతుంది. అయితే దాంట్లో భాగంగా రైతు భరోసా కేంద్రాల పేరును మార్చడం జరిగింది. అయితే ఈ రైతు భరోసా కేంద్రాలను ఆనాటి వైసీపీ ప్రభుత్వం మొదలు పెట్టింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ ప్రభుత్వం పథకాల అమలులో భాగంగా ఈ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే ఈ రైతు భరోసా కేంద్రాలు రైతులకు చాలా ఉపోయాగంగా ఉండేవి. ఏదైతే రైతు భరోసా కేంద్రం ఉందో దాని పరిధిలో ఉన్న రైతులకి సబ్సిడీలు ఇత్తనలు కావొచ్చు పంట తాలూకా సలహాలు కావొచ్చు ఇలా చాలా విధాలుగా ఈ రైతు భరోసా కేంద్రలు రైతులకు ఉపోయోగ పడేవి. అంతే కాకుండా తమ పంటను ఆన్లైన్ లో నమోదు చేసుకోవడానికి లేదా పంటనష్టం నమోదు చేసుకోవడానికి కూడా ఉపయోగ పడేవి. అయితే ఎవరికైతే విపత్తుల కారణంగా పంట నష్టం వస్తుందో వారి పేర్లను ఈ కేంద్రాలలో నమోదు చేసి ఎటువంటి అక్రమాలు జరగకుండా నేరుగా రైతుల కథలో పంట నష్టపరిహారం జామ అయ్యేలా చర్యలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు రైతు భరోసా కేంద్రం పేరును రైతు సేవ కేంద్రంగా కూటమి ప్రభుత్వం మార్చడం జరిగింది.
Rythu Seva Kendram
గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల కోసం ప్రతి గ్రామపంచాయతీలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని స్థాపించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున, ఈ రైతు భరోసా కేంద్రాన్ని రైతు సేవ కేంద్రంగా పేరు మార్చడం జరిగింది.ఈ రైతు సేవ కేంద్రం ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు అందించటం, పంట నమోదు చేయటం, పెట్టుబడి సాయం నమోదు చేయటం, రైతులకు సూచనలు ఇవ్వటం మరియు వివిధ రకాల సహాయం అందించడం కోసం, ప్రతి పంచాయతీ లెవల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ను నియమించడం జరిగింది. ప్రస్తుతం మీ రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవ కేంద్రంగా పేరు మార్చబడింది.
| Name | Rythu Bharosa Kendram |
| Renamed As | Rythu Seva Kendram |
| Renamed By | TDP-JSP-BJP |
| Benifits To | AP Farmers |
| State | Andhra Pradesh |
| Applications Process | Online/Offline |
| Official Website | CLICK HERE |
- తల్లికి వందనం 22న తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 | జీవో రిలీజ్!
- తల్లికి వందనం eKYC, హౌస్హోల్డ్ మ్యాపింగ్ అప్డేట్స్ ఇవే!
- తల్లికి వందనం.. ఈ నెల 24న ఖాతాల్లోకి నిధులు, కొత్త రూల్స్ ఇవే!
- Thalliki Vandanam Payment Status 2026 – bm sgsw ap gov
- Thalliki Vandanam Eligibility Status Check 2026
Big Changes AP In Rythu Bharosa Kendram
కొత్త ప్రభుత్వం “రైతు భరోసా కేంద్రం”లలో పెద్ద మార్పులు చేపట్టింది అవి ఇవే :-
- Dr. YSR రైతు భరోసా కేంద్రం పేరు “రైతు సేవా కేంద్రం” గా మార్చబడింది.
- RBK/కియోస్క్/సాఫ్ట్వేర్లలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోతో నవరత్నాలు మరియు RBK లోగోను వెంటనే తొలగించాలి.
- జిల్లా, మండలం, RBK స్థాయిలో ఉన్న AABలను వెంటనే రద్దు చేయాలి.
- RBK ఛానల్/స్టూడియో పేరు “పాడి పంటలు ఛానల్/స్టూడియో” గా మార్చబడింది.
- Dr.YSR రైతు భరోసా మ్యాగజైన్ పేరు “పాడి పంటలు మ్యాగజైన్” గా మార్చబడింది.
పై 5 కార్యకలాపాలను రాష్ట్రవ్యాప్తంగా వెంటనే అమలు చేయాలని కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
పైన ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే దయచేసి మీ తోటి మిత్రులకు షేర్ చెయ్యగలరు.