Join Telegram
Join Now

తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకం కింద అర్హులైన విద్యార్థులకు రూ.15,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మొత్తం నేరుగా తల్లి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆర్థిక కారణాల వల్ల పిల్లలు చదువు మానేయకుండా కొనసాగించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నారు.
Eligibility Criteria – అర్హతలు
- విద్యార్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన పాఠశాలలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి.
- కుటుంబంలో కనీసం ఒక చెల్లుబాటు అయ్యే Rice Card ఉండాలి.
- అనాథలు లేదా గృహరహిత పిల్లలు నమోదు చేసిన వాలంటరీ సంస్థల ద్వారా స్కూల్లో చేరి ఉండాలి.
- తల్లి బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి, NPCI ద్వారా DBTకు ఎనేబుల్ అయి ఉండాలి.
- 2025–26 విద్యాసంవత్సరంలో 1వ నుంచి 12వ తరగతిలో అడ్మిషన్ పూర్తయ్యాకే పరిగణనలోకి తీసుకుంటారు.
- కుటుంబ భూమి పరిమితి:
- తడి భూమి 3 ఎకరాల లోపు, లేదా
- పొడి భూమి 10 ఎకరాల లోపు, లేదా
- తడి + పొడి కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి.
- గత 12 నెలల సగటు విద్యుత్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి.
- తదుపరి విద్యాసంవత్సరంలో కనీసం 75% హాజరు ఉండాలి.
- కుటుంబ నెలసరి ఆదాయం
- గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000 లోపు
- పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 లోపు ఉండాలి.
Documents Required – అవసరమైన పత్రాలు
- PAN Card
- Ration Card
- ఫోటోతో కూడిన బ్యాంక్ / పోస్టాఫీస్ పాస్బుక్
- Voter ID Card
- Driving License
- MGNREGA Card
- ఫోటోతో కూడిన Kisan Passbook
How to Apply for Thalliki Vandanam Scheme – అప్లై చేసే విధానం
- ముందుగా GSWS NBM (Navasakam Beneficiary Management) అధికారిక వెబ్సైట్కి వెళ్లాలి.
- హోమ్పేజ్లో ఉన్న “Apply Now” ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారంలో అవసరమైన వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి.
- అడిగిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
- నమోదు చేసిన వివరాలను ఒకసారి రివ్యూ చేయాలి.
- చివరగా Submit బటన్పై క్లిక్ చేస్తే అప్లికేషన్ పూర్తవుతుంది.
Selection Criteria – ఎంపిక విధానం
- విద్యార్థి ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినవారై ఉండాలి.
- 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతూ ఉండాలి.
- 75% హాజరు నిబంధనను తప్పనిసరిగా పాటించాలి.